Friday, February 3, 2012

అశాశ్వతం!

చాలా కాలం క్రితం ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. పవిత్ర జీవితం గడుపుతూ అతను చాలా సంతోషంగా ఉండేవాడు. ఊళ్లో అతనికి చాలా మర్యాదా, మన్ననా ఉండేది. అనేకమంది శిష్యులూ ఉండేవాళ్లు.
ఒకసారి అతనికి ఒక సంకల్పం కలిగింది- కొండ మీద ఒక పెద్ద బుద్ధ మందిరం నిర్మించాలని. మరుసటి దినమే అతను పని ప్రారంభించాడు: విరాళాలు వసూలు చేయటం, పనివాళ్లను తీసుకురావటం, సామాన్లు కొనటం, రాళ్లు తరలించటం - చాలా పెద్ద పని మొదలైంది.
భిక్షువు ఆ మందిర నిర్మాణంలో చాలా శక్తినే వెచ్చించాల్సి వచ్చింది.
మందిరం తయారయ్యేందుకు చాలా రోజులు - నెలలు - సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో అంతా భిక్షువు నిర్మాణం పర్యవేక్షణ కోసం రాత్రింబవళ్లూ శ్రమించాడు.
మందిరం తయారయ్యే సరికి, భిక్షువు శక్తి అంతా పూర్తిగా హరించుకు పోయింది. ఆ రోజున అతను పడుకునే సరికి విపరీతమైన జ్వరం వచ్చేసింది. తెల్లవారే సరికి అతని పరిస్థితి మరింత విషమం అయిపోయింది.
కొంచెంసేపట్లో మరణిస్తాడనగా అతను తన శిష్యుల్ని పిలిచి, తన మంచాన్ని ఎత్తుకొని మందిరం చుట్టూ త్రిప్పి చూపించమన్నాడు.
వాళ్లు తనని అలా త్రిప్పుతుంటే అతను ఒక్కొక్క రాయినీ ముట్టుకొని బిగ్గరగా ఏడ్చాడు.

No comments:

Post a Comment