Saturday, September 8, 2012

పండు పండింది!

జెన్ గురువు 'మత్సు' కి  చాలామంది శిష్యులుండేవాళ్ళు.  వాళ్ళలో ఒకాయన పేరు 'పండు' ('బిగ్ ప్లమ్').
ఒకసారి ఎవరో ఓ సన్యాసి పండుని అడిగాడట- "మత్సు నీకు ఏమి నేర్పించాడు?" అని.
" 'ఈ మనసే, బుద్ధుడంటే' " చెప్పాడు ప్లమ్.
" ఈ మధ్య అట్లా చెప్పట్లేదాయన- 'ఈ మనసు కానిది ఏదీ బుద్ధుడు కాదు' అని చెబుతున్నాడు" అన్నాడు సన్యాసి.
" 'ఈ మనసు కానిదేదీ బుద్ధుడు కాదు' ని ఆయన దగ్గర పెట్టుకొమ్మనండి- 'ఈ మనసే బుద్ధుడంటే' ని నేను అట్టేపెట్టుకుంటాను" అన్నాడు పండు.
సంగతి 'మత్సు' ని చేరింది-
"పండు పండింది!" అన్నాడట, ఆయన సంతోషపడిపోతూ.